హైదరాబాద్ : హైదరాబాద్ శివారు ప్రాంతం వద్ద గల హయత్ నగర్ రాఘవేంద్ర కాలనీలో ఒకే రూంలో ప్యాన్ కు ఉరేసుకొని ఇద్దరు యువతులు మమత(20),గౌతమి(20) అనే ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మమత, గత కొన్నేళ్ళ క్రితం నగరానికి వచ్చి తల్లిదండ్రులతో కలిసి హయత్ నగర్ శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మమత ఇంటర్ పూర్తి చేసి ఇద్దరు పక్క పక్కనే నివాసం ఉండేవారని స్థానికులు తెలిపారు. గౌతమి స్వస్థలం కర్నూల్ జిల్లా మాధవరం మండలం వెలుగోడు గౌతమి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మమత తల్లిదండ్రులు మహబూబ్ నగర్ లో గత బుధవారం నాడు వివాహానికి వెళ్లగా ఈ రోజు ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులకి భారంగా ఉన్నామని ఆత్మ హత్యకు చేసుకుంటున్నామని సూసైడ్ నోట్ వ్రాసి ఆత్మహత్యకి పాల్పడిన ఇద్దరు స్నేహితుల ఘటన స్థానికులను కలిచివేసింది. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గదిలో సీలింగ్ ఫ్యాన్ కు మృతదేహాలు వేలాడుతున్నాయని, మమతా కుటుంబం శుక్రవారం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని, వారు తలుపు తట్టినప్పటికీ, ఎటువంటి స్పందన రాకపోగా, బలవంతంగా తెరిచేసరికి శవాలు వేలాడుతున్నాయని చెప్పారని పోలీసులు పేర్కొన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..