Bandi Sanjay: దళితుడిని సీఎంను చేసి కొత్త సచివాలయంలో కూర్చోబెట్టు: బండి సంజయ్
Bandi Sanjay said that BJP will organize Telangana Liberation Days as per the wish of Telangana people. తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయానికి 'అంబేద్కర్' పేరు పెడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ స్పందించారు. ఇది మంచి నిర్ణయమే అని, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని మాట నిలబెట్టుకోకపోతే తల నరుక్కుంటానన్న కేసీఆర్ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు దళితుడిని సీఎం పదవిలో కూర్చోబెట్టాలని, కొత్త సచివాలయంలో సీఎం కొత్త సీట్లో దళితుడినే కూర్చోబెట్టాలని సవాల్ విసిరారు.