BRS MLA Upender Reddy: అధికారులకు BRS ఎమ్మెల్యే వార్నింగ్..
BRS MLA Upender Reddy: ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అధికారులపై రెచ్చిపోయారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. సకాలంలో సర్టిఫికేట్లు అందించకుంటే తన్నాల్సి ఉంటుందన్నారు. పనులు చేయడం చేతకాకుంటే వదిలిపెట్టి వెళ్లిపోవాలని, ఉద్యోగాల కోసం వందల మంది ఉన్నారని అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. సోమవారం వరకు సర్టిఫికేట్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.