KCR Delhi Tour: ఢిల్లీకి సీఎం కేసీఆర్.. వారం రోజులు అక్కడే మకాం
CM KCR in Delhi Tour: ఢిల్లీలో బిఆర్ఎస్ ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ దంపతులు మంగళవారం, బుధవారం రెండు రోజుల పాటు రాజశ్యామల యాగం చేయనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఢిల్లీలో మకాం వేసి పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.