CM Jagan: ఇవాళ నర్సీపట్నంలో సీఎం జగన్ పర్యటన.. వైద్య కళాశాలకు శంకుస్థాపన
CM Jagan: ఏపీ సీఎం జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తాండవ-ఏలేరు కాలువల అనుసంధానికి శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరగనున్న బహిరంగ సభలో జగన్ ప్రసగించనున్నారు.