Congress Party: తెలంగాణలో ఎన్నికలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం: కాంగ్రెస్ పార్టీ
Congress Party: కర్ణాటకలో అధికారం హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే దూకుడుగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే నెలలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ హై కమాండ్ ప్రకటించింది. సర్వేల ద్వారా గెలిచే వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేసింది. ఎన్నికలకు సంబంధించిన కమిటీలను పది రోజుల్లో ప్రకటిస్తామని తెలిపింది. తెలంగాణలో BRSతో ఎటువంటి పొత్తు ఉండబోదని AICC స్పష్టం చేసింది.