Gold Smuggling: బంగారం అక్రమదారుల కొత్తకొత్త పంథాలు..!

Wed, 06 Jul 2022-4:22 pm,

Gold Smuggling: బంగారం అక్రమదారులు కొత్తకొత్త పంథాలను అనుసరిస్తున్నారు. అయినప్పటికీ కస్టమ్స్‌ అధికారుల చేతిలో అడ్డంగా దొరికిపోతున్నారు. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. కువైట్‌  నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల నుంచి 25 లక్షల విలువైన 478 గ్రాముల బంగారం పట్టుకున్నారు. బంగారాన్ని నైట్రిక్‌ యాసిడ్‌ లో ముంచి టవల్‌ లో తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link