India Coronavirus Update: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు!
భారత దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో (సోమవారం నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు) 4,369 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. మహమ్మారి బారిన పడి 20 మంది చనిపోయారు. ఒక్కరోజులో 5,178 మంది కొవిడ్ 19 నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉండగా.. యాక్టివ్ కేసులు 0.11 శాతంగా ఉంది.