Pawan Kalyan: మారిన పవన్ కల్యాణ్ ఏపీ షెడ్యూల్, ఇవాళే రాష్ట్రానికి జనసేనాని!
Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటన షెడ్యూల్ మారింది. ఇవాళే ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు ప్రకటించారు. నేడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. వారాహి యాత్ర ఏర్పాట్లు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోలీసు ఆంక్షలపై పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. యాగాన్ని రేపు నిర్వహించాలా..? లేక ఎల్లుండి నిర్వహించాలా..? అనే అంశం పైనా నిర్ణయం తీసుకోనున్నారు. వారాహి యాత్రకు ఓ రోజు ముందుగానే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యా్ణ్ వెళ్లనున్నారు. వాస్తవానికి 13న ఏపీకి రానున్నట్లు పవన్ కల్యాణ్ తొలుత ప్రకటించారు. అయితే ఏపీ ప్రభుత్వంపై నడ్డా తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో పవన్ దూకుడు పెంచినట్లు తాజా పరిణామం చూస్తే అర్థమవుతుంది.