Kerala: ఆర్టీసీ బస్సును ఢీకొన్న టూరిస్ట్ బస్సు... 9 మంది మృత్యువాత..
Kerala Bus Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల టూరిస్ట్ బస్సు కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృత్యువాత పడగా.. 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో కొంత మంది విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.