Manickam Tagore: గాంధీభవన్కు చేరుకున్న మాణిక్రావు థాక్
Manickam Tagore: తెలంగాణ కాంగ్రెస్ కుమ్ములాటలకు చెక్ పెట్టే లక్ష్యంతో ఇన్ఛార్జ్ మానిక్రావు థాక్రే హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో మానిక్రావు థాక్రే కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. గాంధీభవన్లో పార్టీ సీనియర్ నేతలతో విడివిడి గా సమావేశం కానున్నారని సమాచారం. సాయంత్రం టీపీసీసీ సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది.