Dowleswaram Barrage: ధవళేశ్వరానికి 25 లక్షల క్యూసెక్కుల వరద.. వంతెనపై రాకపోకలు బంద్
Dowleswaram Barrage: గోదావరి మహోగ్రరూపం కొనసాగుతోంది. గోదావరి చరిత్రలోనే జూలై నెలలోనే రికార్డ్ స్థాయిలో అత్యంత ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. శనివారం ఉదయం 11 గంటల సమయానికి ధవళేశ్వరం బ్యారేజీకి 24.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. 1986 తర్వాత ధవళేశ్వరం దగ్గర 24 లక్షలకు పైగా ఇన్ ఫ్లో నమోదు కావడం ఇదే. జూలైలో ఇంతటి వరదలు ఎప్పుడు రాలేదు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.ధవళేశ్వరం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేశారు.