PM Modi: వెంకయ్య నాయుడిని కొనియాడిన ప్రధాని మోడీ..!
PM Modi: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనుద్దేశించి ప్రసంగించారు. వెంకయ్య సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. వెంకయ్య తన ప్రతి అడుగులో యువత కోసం పనిచేశారన్నారు మోదీ. దేశ యువత వెంకయ్యను ఎంతో అభిమానిస్తుందన్నారు ప్రధాని.