Podu Lands In Khammam: ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత.. పోడు భూమి రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణ

Sat, 09 Jul 2022-2:13 pm,

Podu Lands In Khammam: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి ఫారెస్టు ఎల్లన్న నగర్‌లో ఉద్రిక్తత తలెత్తింది. పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులను ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. రైతులకు, ఫారెస్ట్ అధికారికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇదే సమయంలో తన చొక్కాను తానే చించుకున్నాడు ఎల్లన్న నగర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చంద్రు. రైతులు చొక్కా చించి దాడి చేశారని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు.  ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తప్పుడు కేసుతో రైతులపై కేసు నమోదు చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో ఫారెస్ట్ ఆఫీసర్ చొక్కా చించుకున్న విజువల్స్ వైరల్‌గా మారాయి. ఆరుగురు గిరిజన రైతుల మాత్రం తప్పుడు కేసుతో జైలుకి వెళ్లి వచ్చారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link