Revanth Reddy:గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే: రేవంత్రెడ్డి
Revanth Reddy: గిరిజనులకు వేలాది ఎకరాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఎక్కడో మారుమూల తండా నుంచి వచ్చిన బలరాం నాయక్కు కేంద్ర మంత్రిగా, శంకర్ నాయక్కు జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ అవకాశమిచ్చిందన్నారు. ఇది గిరిజనులకు కాంగ్రెస్ ఇచ్చిన గౌరవంగా ఆయన అభివర్ణించారు.