Tamilisai Soundararajan: కాసేపట్లో ఢిల్లీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై..
Tamilisai Soundararajan: తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల పరస్పర ఆరోపణలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇంతటి పొలిటికల్ హీట్లో గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్మీ మెమోరియల్ కార్యక్రమంలో పాల్గొననున్నారు గవర్నర్. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలు ఉత్కంఠగా మారుతున్న తరుణంలో తమిళిసై హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రుల్లో ఎవరెవరిని కలవబోతున్నారు, ఎలాంటి చర్చలు జరగబోతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.