Tarakaratna: తారకరత్నకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించిన వైద్యులు..
Tarakaratna: నారా లోకేష్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నకు హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించిన వైద్యులు స్టంట్ వేశారు. లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం కేసీ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుకున్న బాలకృష్ణ ఆస్పత్రికి వచ్చారు. తారకరత్న ఆస్పత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదు. శరీరం నీలంగా మారింది. వెంటనే చికిత్స ప్రారంభించామని.. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు 45 నిమిషాల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు.