Telangana Politics: రాష్ట్రంలో పెరిగిన ఎన్నికల హడావుడి..
Telangana Politics: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది.దీంతో ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న పనులన్ని పూర్తి చేస్తోంది కేసీఆర్ సర్కార్. నాలుగున్నరేళ్లు నాన్చి... ఎట్టకేలకు కొల్లూరులో డబుల్ ఇండ్లను ప్రారంభిస్తున్నారు. అటు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఇవాళ మొదలు పెట్టనున్నారు. తొమ్మిదేళ్లుగా పట్టించుకోని తెలంగాణ అమర వీరులను ఎన్నికల ముందు దగ్గరకు చేర్చుకుంటున్నారు ఇందులో భాగంగా శంకరమ్మకు MLC ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల కోసమే ఈ హడావుడి అంతా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.