Women Suicide: కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి యువతి సూసైడ్...
Women Suicide: అత్యాధునిక టెక్నాలజీతో, హైదరాబాద్ నగరానికే తలమానికంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆత్మహత్యలకు కేంద్రంగా మారుతోంది. బ్రిడ్జిపై నుంచి దూకి ఇప్పటివరకు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నారు. బ్రిడ్జి నిర్మించిన రెండేళ్ల వ్యవధిలోనే ఎనిమిది మంది దానిపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కేబుల్ బ్రిడ్జిపైనుంచి దూకి బుధవారం స్వప్న అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.