వెనిజులా కారాబోబో రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వల్షేనియా సిటీలోని ఓ పోలీస్ స్టేషన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 68 మంది మృతి చనిపోయారు. జైలు నుంచి తప్పించుకొనేందుకు ఖైదీలు మంచాలకు నిప్పుపెట్టారు. అదే సమయంలో జైలు బయట కొందరు నిరసన తెలుపుతుండగా.. వారిని తరిమేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రజలు పోలీస్ స్టేషన్ కు నిప్పుపెట్టగా అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.