Blast at Mosque in Afghanistan: వరుస పేలుళ్లతో అప్గాన్ అట్టుడుకుతోంది. తాజాగా శుక్రవారం మరో బాంబ్ బ్లాస్ట్(Bomb Blast) జరిగింది. షియాలే లక్ష్యంగా కాందహార్‌ ప్రావిన్స్‌(Kandaha Province)లోని ఇమామ్‌ బర్గా మసీదులో శుక్రవారం జరిగిన భారీ పేలుళ్లలో కనీసం 16మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 32 మందికిపైగా గాయపడినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్షతగాత్రులను హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో మసీదు(Mosque) కిక్కిరిసి ఉంది. అదే సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. మరోవైపు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.


Also read: Pakistan vs Talibans: తాలిబన్లు, పాకిస్తాన్ మధ్య విమాన సర్వీసుల వివాదం, నిలిచిన సర్వీసులు


గత శుక్రవారమే ఉత్తర అఫ్గానిస్థాన్‌ కుందుజ్‌ ప్రావిన్స్‌(Kunduz Province) ప్రాంతంలోని ఓ మసీదులో శక్తిమంతమైన పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో కనీసం 60 మంది వరకు దుర్మరణం చెందగా.. భారీ సంఖ్యలో గాయపడ్డారు. అప్పుడూ షియా(Shia)ల మసీదును లక్ష్యంగా చేసుకొని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి