ఆఫ్ఘనిస్తాన్ లోని హెల్మండ్ ప్రావిన్స్ లో  బాంబు పేలుడు సంభవించింది.  ఆ రాష్ట్ర రాజధాని లష్కర్గహ్ నగరంలోని 505 బూస్ట్ పోలీస్ జోన్ వద్ద జరిగిన బాంబు పేలుడులో 14 మంది ఆఫ్ఘనిస్తాన్ సైనికులు గాయపడ్డారు.


మిలిటరీ ఆపరేషన్ ను ప్రారంభించేందుకు సైనికులు బేస్ క్యాంప్ నుండి వెళ్తున్నప్పుడు కారు బాంబు పేలుడు సంభవించిందని రాష్ట్ర గవర్నర్ ఒమర్ జ్వాక్కు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇప్పటివరకు దాడికి ఎవరు పాల్పడ్డారో ఏ గ్రూపు ప్రకటించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.