ప్రముఖ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంను కొత్త సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన కుటుంబ కష్టాలు తనను నిలకడగా ఉండనీయంగా లేదని సమాచారం. ఇటీవలే థానే జైలులో శిక్ష అనుభవిస్తున్న తన సోదరుడు ఇక్బాల్ కస్కర్‌ను చూసిరమ్మని తన అన్న కొడుకులిద్దరినీ ఆయన ముంబాయి పంపించాడని... వారు దుబాయి నుండి టూరిస్టు వీసాపై ముంబయి వచ్చి కొన్నాళ్లు ఉన్నారని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారు థానే జైలులో కస్కర్‌ను కలిసి మాట్లాడారని.. దావూద్ పలు విషయాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు కస్కర్‌తో పంచుకున్నారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా దావూద్ కుమారుడు మొయిన్ నవాజ్ తన తండ్రి బాటలో నడవకుండా... ఇస్లామ్ ప్రబోధకుడిగా మారడానికి కంకణం కట్టుకున్నాడని కూడా సమాచారం.


గతంలో మొయిన్ నవాజ్ విషయంలో కూడా పలు వార్తలు వచ్చాయి. మొయిన్ మౌలానాగా మారాలని నిశ్చయించుకున్నాడట. శాంతిప్రబోధకుడిగా మారి ప్రపంచానికి ఇస్లామ్‌లో మంచిని ప్రజలకు పంచడానికే జీవితాన్ని అర్పిస్తానని తెలపడం గమనార్హం