ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ రోజు తన 34వ జన్మదినాన్ని జరుపుకోబోతున్నారు. అయితే ఈ శుభ సందర్భాన ఆయన ఎలాంటి పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేయకపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇటీవలే ఆయన కేంబ్రిడ్జ్ అనాలటికా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆచి తూచి పోస్టులు పెడుతున్నారని కూడా సమాచారం. గత సంవత్సరం అయితే ఆయన మాంసం ముక్కల్లాంటి కేకులతో బర్త్ డే జరుపుకున్నారు. ఆ ఫోటోలను ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు కూడా చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకు ముందు జరిగిన  జన్మదిన వేడుకల్లో తాను స్వయంగా తన భార్యతో కలిసి వండిన పదార్థాలను పోస్టు చేశారు. అంతకు ముందే ఆయన తన సతీమణితో కలిసి వంట వండుతున్న ఫోటోని కూడా పోస్టు చేశారు. అయితే జుకర్‌బర్గ్ తాను స్వయంగా భోజన ప్రియుడినని ఆయనకాయనే చెప్పుకున్నారు. నిన్న కూడా జుకర్‌బర్గ్ "మదర్స్ డే" సందర్భంగా తన చిన్నారి ఫోటోని పోస్టు చేశారు.