భారత్ - అమెరికా మధ్య జరిగిన రక్షణ ఒప్పందంతో పాక్ బాంబేలెత్తుతోంది. ఇప్పటి వరకు వ్యూహాత్మక బలం సమానస్థాయిలో ఉందనుకున్న పాక్ ఈ ఒప్పందంతో పాక్ వణుకుపుడుతోంది. గత జూన్ లో అమెరికాతో భారత ప్రధాని మోదీ అత్యంత కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. జలాంతర్గాముల కోసం ఉపయోగించే 22 డ్రోన్లకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఈ డ్రోన్లతో భారత బలం రెట్టింపయ్యింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందనే కారణాలతో పాకిస్థాన్ పై అమెరికా కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశానికి ఎంతో కాలంగా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా నిలిపేసింది. తాజాగా భారత్ కు అమెరికా చాలా సన్నిహితంగా వ్యవహరిస్తుండటం పాక్ కు మింగుడుపడటం లేదు. దీనికి తోడు రక్షణ ఒప్పందంతో మరింత ఉలిక్కిపడుతోంది. 


పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా ఇస్లాబాద్ శుక్రవారం విలేఖరుల సమావేశంలో  చేసిన వ్యాఖ్యలే  పాక్ ఏ స్థాయిలో భయపడుతోందనే విషయం తెలిసింది. ఈ సందర్భంగా నఫీజ్ జకారియా  భారత్ - అమెరికా రక్షణ ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో భారత్, పాక్ ల మధ్య వ్యూహాత్మక బలం సమస్థాయిని కోల్పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ డ్రోన్లతో భారత బలం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బ్యాలెన్స్ తప్పితే, దక్షిణాసియాలో సుస్థిరత్వానికి ప్రమాదం ఏర్పడుతుందని చెప్పారు.