AP Corona update: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.. గడిచిన 24 గంటల్లో 57,745 మంది నమూనాలు పరీక్షించగా 1,085 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,677 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణాలో ముగ్గురు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా(Corona) నుంచి శనివారం 1,541 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల(Positive Cases) సంఖ్య 20,02,340కి చేరగా...వీరిలో ఇప్పటి వరకు 19,73,940 మంది బాధితులు కోలుకుని..డిశ్చార్జి(Discharge) అయ్యారు. మహమ్మారి బారినపడి మొత్తం 13,723 మంది ప్రాణాలు వదిలారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,60,91,962 కరోనా నిర్థారణ పరీక్షలు(Covid Tests) నిర్వహించారు. 


Also Read: AP Corona Update: ఏపీలో గణనీయంగా తగ్గుతున్న కరోనా ఉధృతి


జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల(Covid Positive cases) వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 29, చిత్తూరు జిల్లాలో 130, తూర్పుగోదావరి జిల్లాలో 105, గుంటూరు జిల్లాలో 116, కడప జిల్లాలో 32, కృష్ణాజిల్లాలో 99, కర్నూలు జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 108, ప్రకాశం జిల్లాలో 122, శ్రీకాకుళం జిల్లాలో 42, విశాఖపట్నం జిల్లాలో 99, విజయనగరం జిల్లాలో 56, పశ్చిమగోదావరి జిల్లాలో 137 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook