AP Covid-19 Update: ఏపీలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 18,601 నమూనాలను పరీక్షించగా.. 1,597 పాజిటివ్‌ కేసులు (Corona Cases in AP) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,05,052కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనాతో గత 24గంటల్లో 8 మంది మృతి చెందారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 14,672కి చేరింది. విశాఖలో ఇద్దరు, చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం మరియు పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 


రాష్ట్రంలో ప్రస్తుతం 62,395 కరోనా యాక్టివ్ కేసులు (Active Cases in AP) ఉన్నాయి. కరోనా నుంచి 8,766 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రికవరీ అయిన సంఖ్య  22.25.090కి చేరింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో గుంటూరు, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. 


Also Read: Ap cm ys jagan: మీరు లేకపోతే నేను లేనంటూ సీఎం జగన్ భావోద్వేగం


దేశంలో ఒక్క రోజులోనే  83,876 కరోనా కొత్త కేసులు (Corona  Cases in India) వెలుగు చూశాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 11,08,938 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. వైరస్ తో తాజాగా 895 మంది మృతి చెందారు. ఒక్క రోజులోనే 1,99,054 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook