అమరావతి: ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం తరహాలోనే బుధవారం ఏప్రిల్ 1 నాడు కూడా రాష్ట్రంలో మరో 24 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో గుర్తించిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 111కు చేరింది. ఈ మేరకు ఏపీ సర్కార్ తరపున రాష్ట్ర నోడల్ అధికారి డా అర్జ శ్రీకాంత్ బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. రాత్రి 7 గంటల తర్వాత విడుదలైన కోవిడ్ పరీక్షల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించినట్టు నోడల్ అధికారి డా అర్జ శ్రీకాంత్ తెలిపారు. Gandhi hospital: డాక్టర్లపై దాడి ఘటన.. స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ సర్కార్ వెల్లడించిన వివరాల ప్రకారం జిల్లాల వారీగా వివరాలిలా ఉన్నాయి.


క్ర. సంఖ్య జిల్లా పేరు మొత్తం కేసుల సంఖ్య  కోలుకున్న వారి సంఖ్య 
1 అనంతపూర్                2  
2 చిత్తూరు                6  
3 తూర్పు గోదావరి                9  
4 గుంటూరు               20  
5 కడప               15  
6 కృష్ణా               15  
7 కర్నూలు                 1  
8 నెల్లూరు                 3                     1
9 ప్రకాశం               15  
10 విశాఖపట్నం               11                      1
11 పశ్చిమ గోదావరి                        14  
    111                     2

కరోనావైరస్ లైవ్ అప్‌డేట్స్ కోసం జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..