Corona Cases in AP: ఏపీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,954 పరీక్షలు నిర్వహించగా.. 3,205 మందికి వైరస్ పాజిటివ్ (Corona Cases in AP) గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,87,879కి చేరాయి. రెండు రోజుల్లోనే 2వేలకుపైగా కొత్త కేసులు పెరిగాయి. వైరస్ వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,505గా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా నుంచి 281 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,63,255 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 10,119 యాక్టివ్‌ కేసులున్నట్లు (Active Cases in AP) ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా.. విశాఖ జిల్లాలో 695 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. చిత్తూరులో 607, తూర్పుగోదావరిలో 274, శ్రీకాకుళంలో 268, గుంటూరు జిల్లాల్లో 224 మంది వైరస్ బారిన పడ్డారు. ఈ నెల 18 నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. 



Also Read: Night curfew in AP : ఏపీలో నైట్ కర్ఫ్యూ, అప్పటి నుంచే అమల్లోకి.. కోవిడ్ కొత్త ఆంక్షలు ఇవే!


దేశంలో రోజువారీ కరోనా కేసులు (Corona cases in India) స్వల్పంగా పెరిగాయి. తాజాగా 1,94,720 మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్ తో 442 మంది మరణించారు. 60,405 మంది కరోనాను జయించారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి (Omicron Cases in India) చేరింది. దేశంలో ఇప్పటి వరకు 1,53,80,08,200 టీకా డోసులు పంపిణీ చేశారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook