AP Covid-19 Update: ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 4వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 30,886 నమూనాలను పరీక్షించగా.. 4,198 పాజిటివ్‌ కేసులు (Corona Cases in AP) వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,97,369కి చేరింది. కరోనా నుంచి ఒక్క రోజులో 9,317 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 21,94,369 మంది కోలుకున్నారని ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో రికవరీలు 9 వేలు దాటాయి.  గత 24 గంటల్లో వైరస్ తో ఐదుగురు మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో కరోనాతో చిత్తూరులో ఇద్దరు.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.  దీంతో కరోనాతో ఇప్పటి వరకు 14,646 మంది (Corona Deaths in AP) మృతి చెందారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 555 కేసులు, అత్యల్పంగా విజయనగరంలో 54  కేసులు నమోదయ్యాయి. 




దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 1,49,394 కొవిడ్ కేసులు (Corona Cases in India) నమోదయ్యాయి. గత 24 గంటల్లో..వైరస్ తో 1,072 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య 5,00,055కి చేరింది. కరోనా నుంచి 2,46,674 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 14,35,569 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 9.27శాతంగా నమోదైంది. ఇప్పటివరకు 168.47 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook