చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మామండూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న బొలెరా-డీసీఎం వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా కర్నూలు జిల్లా గడివేముల వాసులుగా గుర్తించగా.. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారు తిరుపతి రుయూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిత్తూరు ఎస్పీ బంగ్లాలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య


చిత్తూరు ఎస్పీ బంగ్లాలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజశేఖర్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.