AP Covid-19 Update: ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే రాష్ట్రంలో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 6,213 మందికి వైరస్ పాజిటివ్ (Corona Cases in AP) గా నిర్ధారణ అయింది. కరోనాతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో కరోనా నుంచి 10,795 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,05,930 కరోనా యాక్టివ్‌ కేసులు (Covid-19 Active Cases in ap) ఉన్నాయి. గత  24 గంటల్లో 35,035 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 903 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో గుంటూరు జిల్లాలో 830,  తూ.గో. జిల్లాలో 731, కర్నూలు జిల్లాలో 679 కరోనా కేసులు వెలుగుచూశాయి. 


దేశంలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. తాజాగా 1,67,059 కొత్త కేసులు (Corona Cases in India) నమోదయ్యాయి. 1192 మరణాలు నమోదయ్యాయి. వైరస్ నుంచి 2,54,076 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో 17,43,059 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు 1,66,68,48,204 టీకా (Vaccination) డోసులు పంపిణీ చేశారు. 


Also Read: India Covid 19 Cases Update: భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు.. ఆందోళన కలిగిస్తున్న మరణాలు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook