అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆనవాయితీ ప్రకారమే గవర్నర్‌ ప్రసంగంతో అసెంబ్లీ సమవేశాలు ప్రారంభం కానుండగా.. సమావేశాలు సజావుగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించేందుకు ఇవాళ సచివాలయం, పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్ కోడెల శివప్రసాద రావు భేటీ అయ్యారు. సమావేశాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు స్పీకర్ కోడెల శివప్రసాద రావు పలు సూచనలు చేశారు.


శాసనసభా సమావేశాల నేపథ్యంలో వెలగపూడిలోని శాసనసభా ప్రాంగణం, పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.