AP CoronaVirus Cases | ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ప్రభుత్వం కరోనా విషయంలో పటిష్ట చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 837 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 789 మందికి కరోనా సోకగా, మిగతా 48 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు (CoronaVirus Cases In AP) 16,934కు చేరుకున్నాయి. ఏపీలో కరోనా మరణాలు 200 దాటిపోయాయి. భారత్‌లో ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 7,632 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 9,096 కోవిడ్19 (COVID-19) యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 8 మంది వ్యక్తులు కరోనాతో మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 206కి చేరింది. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు జులై 3న మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  Also read: AP: ఆంధ్రప్రదేశ్ లో ఇకపై అన్ లాక్ 2: సడలింపులు ఇవే


ఏపీలో గడిచిన 24 గంటల్లో 38,898 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 837 మందికి కోవిడ్19(COVID19) పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 258 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒక్కరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos


నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 9,71,611 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 14,414 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 2,111 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 409 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
 బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!