Mekapati Goutham Reddy Funeral: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు (Mekapati Goutham Reddy Funeral) నిర్వహించారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు చేశారు. గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. మేకపాటి అంత్యక్రియల్లో సీఎం జగన్ (CM Jagan), వైఎస్‌ భారతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని...ఆశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. అభిమాన నేతను చివరిచూపు చేసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సోమవారం (ఫిబ్రవరి 21) ఉదయం మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి (50) (Mekapati Goutham Reddy) గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం నెల్లూరులోని మంత్రి నివాసం నుంచి ఉదయగిరి అంతిమయాత్ర మెుదలైంది. మంత్రి గౌతమ్‌రెడ్డిని చివరిసారి చూసేందుకు దారి పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తుది వీడ్కోలు పలికారు. అంత్యక్రియల సమయంలో గౌతమ్‌రెడ్డిని చూసి ఆయన తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి విలపించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.


Also Read; Mekapati Goutham Reddy Funeral: ఎయిర్ అంబులెన్స్ లో నెల్లూరుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook