Vizag steel plant: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. సమస్యను విన్నవించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రధాని నరేంద్ర మోదీ అప్పాయింట్‌మెంట్ కోరారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైజాగ్ స్టీల్‌ప్లాంట్ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan)మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు లేఖ రాశారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని..కేంద్ర ప్రభుత్వ(Central government) నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను నేరుగా విన్నవించేందుకు ప్రధాని అప్పాయింట్‌మెంట్ కోరారు. తన వెంట అఖిలపక్షాన్ని తీసుకొస్తానని చెప్పారు. కేంద్ర ప్రకటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని..విశాఖ స్టీల్‌ప్లాంట్‌ (Vizag steel plant)ఆంధ్రుల మనోభావాలతో ముడిపడిన అంశమని లేఖలో ప్రస్తావించారు. స్టీల్‌ప్లాంట్‌పై ప్రత్యక్షంగా 20 వేల కుటుంబాలు ఆధారపడ్డాయని స్పష్టం చేశారు.  అఖిలపక్షం, కార్మిక సంఘాల ప్రతినిధులను వెంట తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలు, కార్మికుల అభిప్రాయాలను ముందు ఉంచుతామని లేఖలో పేర్కొన్నారు. ప్లాంట్‌ పునరుద్ధరణకై తమ ముందున్న అవకాశాల్ని వివరిస్తామన్నారు. ప్లాంట్‌పై దృష్టిపెడితే కచ్చితంగా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు.


Also read: AP Municipal Election 2021: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్, పిటిషన్ కొట్టివేసిన Supreme Court


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook