AP Corona Update: కరోనా మహమ్మారి కేసులు ఏపీలో మరోసారి తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న కేసుల సంఖ్య ఇప్పుడు తగ్గుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో భారీగా కేసులు తగ్గాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)నుంచి కోలుకున్న ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగిన సంగతి తెలిసిందే. రోజుకు 11 వందల నుంచి 15 వందల మధ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. హఠాత్తుగా కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38 వేల 69 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కేవలం 618 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. అదే సమయంలో 6 మంది కోవిడ్ కారణంగా మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 14 వేల 142 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో 1178 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 89 వేల 391 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 12 వేల 482 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం 20 లక్షల 47 వేల 459 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 81 లక్షల 32 713 కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)నిర్వహించారు. 


Also read: SSC: 283 పోస్టులకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook