Ap Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత కొద్దికాలంగా ఏపీలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)సృష్టించిన విపత్కర పరిస్థితుల్నించి ఆంధ్రప్రదేశ్ నెమ్మదిగా కోలుకుంటోంది. గత కొద్దిరోజులుగా ఏపీలో కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 85 వేల 283 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1413 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు 18 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 వేల 549 మంది మరణించారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1795 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 19 లక్షల 50 వేల 623 మంది కోలుకున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 19 వేల 549 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19 లక్షల 83 వేల 721కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకూ 2 కోట్ల 52 లక్షల 47 వేల 884 మందికి కోవిడ్ నిర్దారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు. 


Also read: మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook