అమరావతి: ఏపీలో గత 24 గంటల్లో 70,521 మందికి కరోనావైరస్ పరీక్షలు ( Coronavirus tests ) నిర్వహించగా అందులో 5,145 మందికి కరోనావైరస్ పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 7,44,864 గా చేరింది. కరోనా నుంచి గత 24 గంటల్లో 6,110 మంది కోలుకోగా అలా ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య మొత్తం 6,91,040గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 31 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6,159 చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన మొత్తం కరోనావైరస్ పరీక్షల సంఖ్య 64,20,474 కి చేరింది. Also read : SAMSUNG GALAXY F41 price, features: 17 వేలకే 64 MP కెమెరా, 32 MP సెల్ఫీ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా కారణంగా గత 24 గంటల్లో ప్రకాశం జిల్లాలో ఐదుగురు, చిత్తూరు జిల్లాలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ఒకరు, కడపలో ఒకరు, కర్నూలులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు ( COVID-19 death toll ). Also read : సీబీఎస్‌ఈ 12వ తరగతి కంపార్ట్‌మెంట్‌ ఫలితాలు విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe