AP Curfew Exntended: కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కరోనా సంక్రమణ ఛైన్ కొనసాగకుండా ఉండేందుకు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి ఇప్పడిప్పుడే తగ్గుతోంది. కరోనా వైరస్ నియంత్రణకై ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా మే 5 తేదీ నుంచి రోజుకు 18 గంటల కర్ఫ్యూ అమలవుతోంది. మరోవైపు భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. కొద్దిరోజుల క్రితం అంటే పదిరోజుల క్రితం వరకూ 20 వేల కేసులు నమోదయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రోజుకు 8-10 వేల కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా సంక్రమణ ఛైన్ కొనసాగకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 


రాష్ట్రంలో అమల్లో ఉన్న కర్ఫ్యూని మరో పదిరోజుల పాటు అంటే జూన్ 20వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం (Curfew Extension) తీసుకుంది. జూన్ 10 వ తేదీ నుంచి కర్ఫ్యూ సడలింపు వేళల్ని ఉదయం 6 గంటల్నించి 2 గంటల వరకూ పొడిగించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan)  కోవిడ్ నియంత్రణపై నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 


Also read: CA Examination Schedule: సీఏ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఐసీఏఐ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook