Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కే రకం కంటి మందు తప్ప మిగిలిన వాటికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై (Krishnapatnam Anandaiah Cororna Medicine) కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. కరోనా నివారణకు ఆనందయ్య మందు అద్భుతంగా పనిచేస్తుండంతో పెద్దఎత్తున జనం ఎగబడ్డారు. మందు శాస్త్రీయతపై సందేహాలు రావడంతో ఆయుష్, సీసీఆర్ఏఎస్ బృందాలతో ప్రభుత్వం అధ్యయనం చేయించింది. అధ్యయనం నివేదిక సానుకూలంగా ఉండటంతో కంటిమందు అంటే కే రకం మందు తప్ప మిగిలిన మందులకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. Childeal.in


ఇప్పుడు కే రకం మందుకు కూడా హైకోర్టు(Ap High Court) అనుమతిచ్చింది. ఆనందయ్య కె మందును నిపుణుల బృందం పరిశీలించిందని.. కె మందును పంపిణీ చేయొచ్చని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కంటి చుక్కల మందుపై రెండు వారాల్లో నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 21కి కోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఆనందయ్య మందు(Anandaiah Medicine) పంపిణీని స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. త్వరలో ఇతర జిల్లాలకూ విస్తరిస్తామని నిర్వాహకులు తెలిపారు.


Also read: AP Curfew Exntended: ఏపీలో జూన్ 20 వరకూ కర్ఫ్యూ పొడిగింపు, వైఎస్ జగన్ సమీక్షలో కీలక నిర్ణయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook