విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana Mother Passes Away) ఇంట విషాదం చోటుచేసుకుంది. మంత్రి బొత్స తల్లి బొత్స ఈశ్వరమ్మ(84) ఆదివారం వేకువజామున కన్నుమూశారు. వయసురీత్యా గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈశ్వరమ్మ విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే బొత్స ఈశ్వరమ్మ తుదిశ్వాస (Botsa Eswaramma Dies) విడిచారు. Dhoni Retirement: ఎంఎస్ ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది


బొత్స ఈశ్వరమ్మకు మొత్తం పదకొండు మంది సంతానం. ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కాగా, అందులో మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు సైతం రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. బొత్స అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. నేటి మధ్యాహ్నం (ఆదివారం) విజయనగరంలోని స్వర్గధామంలో బొత్స ఈశ్వరమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం. Heavy Rain Alert: మరో మూడ్రోజులు ఏపీలో భారీ వర్షాలు