MLC Sabji Died: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి ప్రాణాలు కోల్పోయారు. గన్‌మెన్, పీఏకు తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ ఉదయం ఏలూరులో జరిగిన అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మెలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ పాల్గొన్నారు. ఆ తరువాత తిరిగి భీమవరం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉండి మండలం చెరుకువాడలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఎమ్మెల్సీ సాబ్జిని ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. గన్‌మెన్, పీఏకు గాయాలవడంతో భీమవరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఆసుపత్రికి చేరుకున్నారు. 


భీమవరం ఆసుపత్రికి చేరుకున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవి ప్రకాష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోస్ట్ మార్టమ్ తరువాత షేక్ సాబ్దీ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. షేక్ సాబ్జి వరుసగా రెండవసారి టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయ సమస్యలపై చురుుగ్గా వ్యవహరించే షేక్ సాబ్జి మరణంతో ఉపాధ్యాయ వర్గాలు షాక్‌లో మునిగిపోయాయి. ప్రమాదానికి కారణమేంటనేది ఇంకా తెలియలేదు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


Also read: Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు బ్రేక్ దర్శనాలు రద్దు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook