AP New Ministers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం సోమవారం (ఏప్రిల్ 11) కొలువుదీరింది. కొత్తగా ఎంపిక చేసిన 25 మందితో రాజ్ భవన్ లో బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పలు ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత పలువురు మంత్రులు సీఎం జగన్ పై తమకు ఉన్న విధేయతను చాటుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొంతమంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు నమస్కారం చేసి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన మరికొంతమంది మంత్రులు మాత్రం సీఎం జగన్ కాళ్ల మీద పడి నమస్కారం చేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నారాయణ స్వామి.. ముఖ్యమంత్రి జగన్ కాళ్లు మొక్కి నమస్కరించారు. ఆ తర్వాత వచ్చిన ఉష శ్రీ చరణ్ కూడా అదే రీతిలో జగన్ కాళ్లపై పడి నమస్కారం చేశారు. 


ఆ తర్వాత మరో ఇద్దరు మంత్రులు గుడివాడ అమర్ నాథ్, జోగి రమేష్ వంటి వారు మోకాళ్లపై పడి సీఎం జగన్ కాళ్లకు నమస్కారం చేసుకున్నారు. నటి, మంత్రి ఆర్కే రోజా మాత్రం సీఎం జగన్ కాళ్లకు నమస్కరించి.. జగన్ చేతిని ఆమె ముద్దాడారు. ఆ విధంగా మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవంలో సీఎం జగన్ పై మంత్రులు తమ విధేయతను చాటుకున్నారు.  


Also Read: MLA Roja: ఎమ్మెల్యే రోజా కీలక నిర్ణయం.. జబర్దస్త్‌కు గుడ్‌బై.. ఇకపై ఏ షూటింగ్స్‌ చేయనని క్లారిటీ..


Also Read: AP New Cabinet: మరి కాస్సేపట్లో కొలువుదీరనున్న ఏపీ కొత్త కేబినెట్, మంత్రుల తుది జాబితా ఇదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook