AP Corona Update: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. కరోనా సంక్రమణను నియంత్రించేందుకు పెద్దఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి నిలకడగా ఉంటూ తగ్గుతోంది. పరీక్షల సంఖ్యను భారీగా పెంచినా..కేసుల సంఖ్య మాత్రం తగ్గుతోంది. ఏపీలో వరుసగా రెండ్రోజుల్నించి కరోనా నిర్ధారణ పరీక్షలు లక్షకు పైగా చేస్తున్నారు. గత 24 గంటల్లో ఏపీలో 1 లక్షా 2 వేల 876 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా కేవలం 6 వేల 770 మందికి పాజిటివ్‌గా తేలింది. అటు 58 మంది ఒక్కరోజులో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 11 వేల 940కు చేరింది. గత 24 గంటల్లో 12 వేల 492 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 లక్షల 6 వేల 949 మందికి కరోనా వైరస్ సోకగా..17 లక్షల 12 వేల 267 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85 వేల 637 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 4 లక్షల 50 వేల 982 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests) చేశారు.


ఏపీలో గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1199 కేసులు, చిత్తూరులో 968, పశ్చిమ గోదావరి జిల్లాలో 765, ప్రకాశం జిల్లాలో 530 కేసులు నమోదయ్యాయి. అటు కడపలో 473, గుంటూరులో 433, శ్రీకాకుళంలో 491, కృష్ణా జిల్లాలో 440 కేసులు రిజిస్టరయ్యాయి. 


Also read: AP CM YS Jagan Delhi Tour: ముగిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook