Ap Exams: కరోనా వైరస్ నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. కరోనా కట్టడికి తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ మహమ్మారి (Corona virus) నియంత్రణపై ఏపీ ప్రభుత్వం (Ap government) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నియంత్రణ కోసం తీసుకోవల్సిన చర్చలపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి కోసం వివిధ కోణాల్లో తీసుకోవల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) దిశానిర్దేశం చేశారని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పాఠశాలల్నించి కరోనా సంక్రమణ జరగకూడదనే ఉద్దేశ్యంతో స్కూళ్లను రేపటి నుంచి అంటే ఏప్రిల్ 20 నుంచి రద్దు చేశామని...సెలవులు ప్రకటించామని చెప్పారు. 1 నుంచి 9వ తరగతి వరకూ స్కూళ్లకు సెలవులు (Ap Schools closed) ప్రకటించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు మాత్రం యధావిధిగా జరుగుతాయన్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఇప్పటికే జరుగుతున్నాయన్నారు. విద్యార్ధులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేశ్ (Ap minister adimulapu suresh ) తెలిపారు. 1 నుంచి 9వ తరగతి వరకూ ఈ విద్యాసంవత్సరాన్ని రద్దు చేస్తున్నామని..అంటే ఇక పరీక్షలు కూడా ఉండవని మంత్రి స్పష్టం చేశారు. 


పదవ తరగతి పరీక్షలు జూన్ నెలలో కాబట్టి..ఇప్పటి వరకూ ఏ మార్పులేదని..యధావిధిగా జరుగుతాయన్నారు. శానిటైజేషన్, భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధారణ వంటి అంశాలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 


Also read: Corona Second Wave: ఏపీలో దడ పుట్టిస్తోన్న కరోనా వైరస్, రోజుకు 6 వేలు దాటుతోన్న కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook