AB Venkateswara Rao : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనను మరోసారి సస్పెండ్ చేసినా తగ్గేదే లే అంటున్నారు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఆయన ఆరోపణలు చేశారు. సస్పెండ్ అయినట్లు తనకు ఇంకా జీవో కాపీ రాలేదన్నారు. మీడియా వార్తలతోనే తనకు తెలిసిందన్నారు. తనపై ఏసీబీ కేసు ఉన్న మాట వాస్తవమే అయినా ఏడాదిన్నర క్రితం కేసు పెట్టినా ఇంతవరకూ చార్జిషీట్ వేయలేదని చెప్పారు. అసలు ట్రయల్ లేకుండా సాక్షులను ఎలా ప్రభావితం చేస్తానని ప్రశ్నించారు ఏబీ వెంకటేశ్వరరావు. ఈ సలహా ఏ తీసేసిన తహసీల్దార్ ఇచ్చారో, పనికిమాలిన సలహాదారు ఇచ్చారో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకసారి హైకోర్టు కొట్టేసినప్పుదు అదే సెక్షన్ కింద మళ్లీ ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 సీబీఐ, 6 ఈడీ కేసుల్లో జగన్ కు చార్జిషీట్ లు ఉన్నాయన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. శ్రీలక్ష్మి పైనా చార్జిషీట్ లు ఉన్నాయన్నారు. శ్రీలక్ష్మికి వర్తించని నిబంధనలు తనకు ఎలా వర్తిస్తాయని అడిగారు. ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ప్రతి వాక్యం తప్పని తాను నిరూపిస్తానని చెప్పారు. ఒక్క రూపాయి అవినీతి జరగని చోట అవినీతి కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు ఏబీ. కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు తనను టార్గెట్ చేశాయని చెప్పారు.కోడికత్తి కేసు అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే గంటల్లోనే అడ్డుకున్నానని చెప్పారు. ఎన్నో వెధవ పనులు అడ్డుకున్నందుకే తనను టార్గెట్ చేశారని తెలిపారు. ప్రభుత్వాన్ని పడగొడతా అని రాజభవన్ గేటు ముందు కామెంట్ చేశానా అని నిలదీశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. సమాజానికి హాని కలిగించే పురుగులను తొలగించే వ్యవసాయం చేస్తున్నానంటూ హాట్ కామెంట్స్ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసేకంటే అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదని కామెంట్ చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి