AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఎఫెక్ట్ ఇప్పుడు తగ్గుతోంది. గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్యలో గణనీయంగా తగ్గుదల కన్పిస్తోంది. ఏపీలో గత 24 గంటల్లో 97 వేల 696 వేల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా..3 వేల 797 కేసులు నమోదయ్యాయి. అంటే కేవలం 3.85 శాతం కేసులు రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18 లక్షల 89 వేల 513కు చేరుకోగా..18 లక్షల 38 వేల మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 35 మంది కరోనా కారణంగా మరణించగా..ఇప్పటి వరకూ 12 వేల 706 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 5 వేల 498 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38 వేల 338 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ ఏపీలో 2 కోట్ల 19 లక్షల 93 వేల 618 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు. 


గత 24 గంటల్లో ఏపీలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 874 కరోనా కేసులు, చిత్తూరులో 488, పశ్చిమ గోదావరి జిల్లాలో 493, ప్రకాశం జిల్లాలో 350 కేసులు నమోదయ్యాయి.


Also read: AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మధ్య తరగతి ప్రజలకు స్థలాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook