AP Corona Update: కరోనా మహమ్మారి శాంతిస్తోంది. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. కరోనా నియంత్రణ కోసం ఓ వైపు భారీగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నా.. కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూనే ఉండటం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఇప్పుడు ఏపీలో గణనీయంగా తగ్గుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగా కరోనా సంక్రమణ వేగం మందగించింది. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. మెగా వ్యాక్సిన్ డ్రైవ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. 


గత 24 గంటల్లో ఏపీలో 96 వేల 121 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) నిర్వహించగా..4 వేల 147 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. నిన్న ఒక్కరోజులో కరోనా కారణంగా రాష్ట్రంలో 38 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 12 వేల 566 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో కరోనా కారణంగా రాష్ట్రంలో 5 వేల 773 మంది కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 18 లక్షల 16 వేల 930 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 46 వేల 126 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకూ 2 కోట్ల 16 లక్షల 37 వేల 606 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలవరపెడుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ (Delta Plus Variant)కేసు ఏపీలో వెలుగు చూడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.


Also read: AP Delta Plus Case: ఏపీకి పాకిన డెల్టా ప్లస్ వేరియంట్, స్పందించిన మంత్రి ఆళ్ల నాని


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook