AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల కన్పిస్తోంది. గత 24 గంటల్లో సుమారు 3 వేల కేసులే నమోదయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి ఏపీలో దాదాపుగా తగ్గుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 90 వేల 532 వేల పరీక్షలు చేయగా కేవలం 2 వేల 930 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. అంటే కేవలం 3.26 శాతం మాత్రమే కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 36 మంది మరణించగా..12 వేల 815 మంది మరణించారు. గత 24 గంటల్లో కోవిడ్ నుంచి 4 వేల 346 మంది కోలుకోగా..ఇప్పటి వరకూ 18 లక్షల 51 వేల 62 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35 వేల 871 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 22 లక్షల 68 వేల 483 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు (Covid19 Tests) చేశారు. 


Also read: LNG Terminal: కాకినాడ డీప్ వాటర్ పోర్టులో త్వరలో ఎల్ఎన్‌జి టెర్మినల్ ఏర్పాటు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook